తెలుగు మత్స్యకారులను ఆదుకోండి
గుజరాత్ సిఎంకు ఫోన్ చేసిన ఏపి సిఎం
అమరావతి: పొట్టకూటికోసం చేపలవేటకు వెళ్లిన తమ మత్స్యకారులను ఆదుకోవాలని ఏపి సిఎం జగన్ మోహన్రెడ్డి గుజరాత్ సిఎం విజయ్ రూపానీ కి ఫోన్ చేసి తెలిపారు. కాగా చేపలవేట కోసం గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన ఏపికి చెందిన మత్స్యకారులను ఆదుకోవాలని తెలిపారు. ఈ విషయాన్ని వైయస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని గుజరాత్ సిఎం విజయ్ రూపానీ కి ఏపి సిఎం వైయస్ జగన్ ఫోన్. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన సిఎం వైయస్ జగన్. సానుకులంగా స్పందించిన సిఎం రూపాని, అన్ని విధాల ఆదుకుంటామని హామి. అని ట్విట్ చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/