వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోండి

జనసేన అధినేత పవన్‌కళ్యాన్‌

pavan kalyan
pavan kalyan

అమరావతి: రాష్ట్రంల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతలను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టి అధినేత పవన్‌కళ్యాన్‌ డిమాండ్‌ చేశారు. వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. వరి, మొక్కజోన్న, ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నయాని, ఇప్పటికే కోతకు వచ్చిన పంటలు నీట మునిగాయని అన్నారు. అలాగే రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కోనుగోలు చేయాలని సూచించారు. అలాగే మామిడి రైతులకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోయిన వారికి రైతు ఉపశమన పథకాలు అమలు చేయాలని అన్నారు. ఇటువంటి సమయంలో రైతుల వసూలు చేసే నీటి తీరువా పన్నును రెట్టింపు చేయలనే ఆలోచన సరికాదని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/