విశాఖపట్నంలో పరిస్థితి బీభత్సం

రోడ్లపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తులు

gas leak situation in Visakhapatnam

Visakhapatnam: విశాఖపట్నంలో పరిస్థితి బీభత్సంగా ఉంది. గ్యాస్ లీకేజి ఇంకా పూర్తిగా అదుపులోనికి రాలేదని చెబుతున్నారు.

విషవాయువు ప్రభావానికి పదుల సంఖ్యలో రోడ్లపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తులు కనిపిస్తున్నారు. గ్యాస్ లీకైన ఫ్యాక్టరీలో ఎవరైనా చిక్కుకుపోయారా అన్న విషయం కూడా పూర్తిగా తెలియరావడం లేదు.

అస్వస్థతకు గురైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళల పరిస్థతి దయనీయంగా ఉందంటున్నారు.

బాధితులను ఆసుపత్రులకు తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తున్నా…బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో తరలింపులో జాప్యం జరుగుతున్నది.

గ్యాస్ ప్రభావిత ప్రాంతాల గ్రామాల ప్రజలను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

దాదాపు రెండు వేల కుటుంబాలు గ్యాస్ ప్రభావానికి గురయ్యారని చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం:https://www.vaartha.com/news/business/