చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు
లండన్ నుంచి వచ్చిన విద్యార్థికి పాజిటివ్గా నిర్ధారణ
Srikalahasti : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గోపాలవనంలో లండన్ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు.
ఈ నెల 19న లండన్ నుంచి శ్రీకాళహస్తికి చేరుకున్న 25 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా బాధితుడు నివాసం ఉంటున్న చోటు నుంచి 3 కిలోమీటర్ల వరకు అనుమతి ఇవ్వరాదని కలెక్టర్ ఆదేశించారు.
కరోనా కేసు నమోదు కావడంతో శ్రీకాళహస్తి ప్రజలు ఉలిక్కిపడ్డారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/