విదేశీయులు బయటికి రావొద్దు

కోలుకుంటున్న కరోనా భాదితులు

corona virus
corona virus

అమరావతి; గత కొద్దీ రోజులుగా విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు 12 వేలమంది వచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది . అయితే వీరిలో 89 మందిని గుర్తించిన అధికారులు వారిని వారి ఇంట్లోనే ఉండమని ఆదేశాలు జారీ చేసింది అయితే ఇప్పటి వరకు ఏపీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని అందులో ఒకరు ఇటలీ నుండి, మరొకరు సౌదీ నుండి, ఇంకొకరు లండన్ నుండి వచ్చారని తెలిపింది. వీరందరూ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఎవరికి కూడా ప్రమాదం లేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 128 మంది కరోనా అనుమానితులను గుర్తించామని వారిలో 108 మందికి నెగిటివ్ వచ్చిందని ఇంకా 17 మంది రిపోర్ట్స్ రావాలని అధికారులు అన్నారు. ఇంకా ఎవరైనా విదేషీయులు కొత్తగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినట్లయితే వారు స్వీయ గృహ నిర్బంధం లో ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి;https://www.vaartha.com/news/national/