వైఎస్ఆర్సిపిలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్
అమరావతి: గుంటూరు జిల్లా టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇవాళ వైఎస్ఆర్సిపిలో చేరారు. సిఎం జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్సిపి కండువా కప్పుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డొక్కాను జగన్ అభినందించారు. అనంతరం, మీడియాతో డొక్కా మాట్లాడుతూ, సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామిని అవుతానని, ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరానని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/