జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడింది
అమరావతి: టిడిపి నేత దివ్వవాణి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గురువారం అమరావతిలో దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ… మీ అవినీతి పరిపాలనకు దిక్కులేని స్థితిలో వివేకానంద రెడ్డి కూతురు సిబిఐ ను ఆశ్రయించడం సిగ్గుపడాల్సిన విషయం ” అని అన్నారు. ఎలక్షన్ టైంలో దీనికి కూడా టిడిపి నే కారణమని, చంద్రబాబే కారణమని చెప్పుకున్నారని అన్నారు. ప్రపంచంలో ఏం జరిగినా వాటన్నిటికీ చంద్రబాబే సమాధానం చెప్పాలా ? అని ప్రశ్నించారు. ఐటీ రంగానికి ఇన్కంటాక్స్ రంగానికి వ్యత్యాసం తెలియని జగన్.. చంద్రబాబును విమర్శించడం చాలా బాధాకరమన్నారు. ” ఐటి దాడుల ద్వారా మీరెంతగా బురద జల్లాలనుకున్నా.. తమ నాయకుడు చంద్రబాబు అలుపెరుగని రుషి గా పని చేస్తున్నారని, ఊరూరా చంద్రబాబును ప్రజలు సిఎం చంద్రబాబు అంటున్నారని చెప్పారు.” జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చంద్రబాబుకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/