చంద్రబాబు కు అనుమతి నిరాకరణ
మేజిస్ట్రేట్ అనుమతి ఉండాలని జైళ్ల శాఖ డీజీ స్పష్టీకరణ
Amaravati: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది.
అస్వస్థతగా ఉన్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి అనుమతితో అమరావతి చేరుకున్న ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు జైళ్ల శాఖ డీజీ అనుమతి నిరాకరించారు.
కరోనా నిబంధనల మేరకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అచ్చెన్నాయుడిని పరామర్శించాలంటే మేజిస్ట్రేట్ అనుమతి తీసుకురావాలని స్పష్టం చేశారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/