శ్రీశైలంలో మళ్లీ దర్శనాలు ప్రారంభం

Srisailam-temple
Srisailam-temple

శ్రీశైలం: శ్రీశైలంలో మళ్లీ దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు. 10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. గత నెల ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో.. జులై 15 నుంచి ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ముందుగా వారం రోజులే ఆలయంలో దర్శనాలను ఉండవని ప్రకటించినప్పటికీ.. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా దర్శనాల నిలుపుదలను పొడిగిస్తూ వచ్చారు. ఆలయంలో యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు, పరోక్ష సేవలను కొనసాగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/