కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కలకలం
జర్మనీ నుంచి వచ్చిన ప్రయాణికుడికి వైద్య పరీక్షలు
కృష్ణా: కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తుంది. కృష్ణా జిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదయింది. జర్మనీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉండడంతో ముందు జాగ్రత్తగా విజయవాడ ఆసుపత్రికి తరలించారు. జర్మనీ నుంచి ఢిల్లీ మీదుగా నిన్న అతడు గన్నవరం వచ్చాడు. కాగా, విజయనగరం బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన యువకుడికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సింగపూర్ నుంచి ఆ యువకుడు వచ్చాడు. అతడిలో వ్యాధి లక్షణాలు లేకపోయినా 24 రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉండాలని వైద్యులు సూచించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయరడి:https://www.vaartha.com/news/business/