ఏపిలో మరో 36 మందికి కరోనా

మొత్తం కేసుల సంఖ్య 2,100..ఆసుప్రతుల్లో చిక్సిత పొందుతున్న 860 మంది

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి కేసుల వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 9,256 శాంపిళ్లను పరీక్షించగా మరో 36 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,100గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 860 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,192 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపి లో మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది. మరోవైపు 50 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

జిల్లాల వారిగా కరోనా కేసుల వివరాలు..

corona-update-in-ap


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/