విజయ నగరంలో 3 కరోనా పాజిటివ్ కేసులు
24 గంటల్లో 8,087 శాంపిళ్ల పరీక్ష
అమరావతి: ఏపిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏపిలో 8,087 శాంపిళ్లను పరీక్షించగా 56 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,833గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 780 మంది డిశ్చార్జ్ కాగా, 38 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,015గా ఉందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. కాగా ఇప్పటి వరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరంలో తాజాగా ఈరోజు 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా వైరస్ కేసుల వివరాలు..
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/