ఏపిలో మరో 68 కరోనా పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసులు 2,787
అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,664 శాంపిళ్లను పరీక్షించగా మరో 68 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 10 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,787 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 816 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,913 మంది డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 58కి చేరింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/