నెల్లూరులోయువకుడికి ‘కరోనా’ పరీక్షలు
వ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానం…
Nellore: నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం చోటుచేసుకుంది. వ్యాధి సోకి ఉండొచ్చనే అనుమానంతో ఇరవై రెండేళ్ల యువకుడికి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లోని కరోనా ఐసోలేటెడ్ వార్డులో యువకుడిని ఉంచారు.
ఈ యువకుడు ఇటలీ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లారు.
కరోనా ఉండొచ్చనే అనుమానాలతో ఎయిర్ పోర్ట్ అధికారులు పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/