ఏపిలో కరోనా విజృంభణ

ప్రతిరోజు 80 కొత్త కేసుల నమోదు

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా తీవ్రత మరింత పెరిగింది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతూన్నాయి. నిన్నటి నుంచి జరిపిన కరోనా పరీక్షల్లో మరో 82 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధకారులు ధృవీకరించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1259 కు చేరుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య కుడా పెరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారిసంఖ్య 31 కు చేరుకుంది. కాగా దీని బారినుండి 258మంది కోలుకోగా.. మరో 970 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూన్నరు. కోత్తగా నమోదు అయిన కేసులలొ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 40 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 17, కడపలో 7, నెల్లూరులో 3, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఒక్కో కేసు, క్రిష్ణా జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/