రైతు భరోసా పథకం నిధులు విడుదల చేసిన సిఎం

బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు 1902కు ఫోన్ చేయాలి…సిఎం జగన్‌

CM Jagan visit AP secretariat
CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసా పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతు భరోసా సొమ్మును రైతుల పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని బ్యాంకు అధికారులకు ముందే చెప్పామని, బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు 1902కు ఫోన్ చేయాలని జగన్ చెప్పారు. ‘నేరుగా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే పరిష్కారం చేస్తాం. నేను స్వయంగా రాసిన లేఖను ప్రతి రైతులకు పంపుతున్నాం. అక్నాలెడ్జ్‌ స్లిప్‌ కూడా రైతు నుంచి తీసుకోవాలని ఆదేశించాను. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది.

ఈ నెల 30న 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆవిష్కరిస్తున్నాం. ఏయే పంటలు వేయాలనే సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంటుందన్న విషయాలు చెబుతారు’ అని తెలిపారు. కాగా, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. అక్టోబర్ నెలలో 2వ విడతగా రబీ అవసరాల కోసం, 3వ విడతగా సంక్రాంతికి రైతులకు పెట్టుబడి సాయంగా కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది. అని ఇవ్వనుందని సిఎం జగన్‌ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/