సంపూర్ణ మద్య నిషేధంపై సీఎం జగన్ మడమ తిప్పారు
దక్షిణాదిలో ఎవరూ చూడని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారు
విజయవాడ: సంపూర్ణ మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్ మడమ తిప్పారని టిడిపి నేత బొండా ఉమ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కల్లీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ను బ్రాండ్గా మార్చేశారని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరూ చూడని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలే కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కల్తీ లిక్కర్ తాగాని కార్మికులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ హయంలో బొత్స లాంటి వారు లిక్కర్ డాన్గా ఉంటే..ఇప్పుడు..ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోనే లిక్కర్ మాఫియా కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లే కాదు మద్యం కూడా డోర్ డెలివరీ చేస్తున్నారని బోండా ఉమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/