జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం
Amaravati: ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జయ ప్రకాశ్ రెడ్డి తన నటనతో సినీపరిశ్రమలో తనకంటే ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఆయన మేనరిజం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తీసుకువచ్చాయని పేర్కొన్నారు.
ఈ విషాద సమయంలో జయప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని జగన్ ఆ సందేశంలో పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/