రెవెన్యూ శాఖపై సిఎం జగన్ సమీక్షా

అమరావతి: ఏపి సిఎం జగన్ ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేయడం, కౌలుదారుల రక్షణ చట్టంపై భూయజమానులకు అవగాహన కల్పించడంపై సీఎం ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తాజా నాడీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health1/