సీఎం జగన్ ప్రజా సేవకుడు అని నిరూపించారు
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే రోజా ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. పాలకుడు అంటే ప్రజా సేవకుడు అని నిరూపించారు మన ముఖ్యమంత్రి జగన్ గారు అని కొనియడారు. తన ఏడు నెలల పరిపాలనలోనే దేశంలో మంచి పరిపాలన అందించిన ముఖ్యమంత్రుల్లో నాల్గవ స్థానంలో మన సీఎం నిలిచారని తెలిపారు. భవిష్యత్తులో నంబర్వన్ స్థానంలో నిలబడి దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూన్నానని అన్నారు. జయహో జగన్ అన్న అంటూ ఎమ్మెల్యే రోజా ట్విట్ చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/