పింగళి పోరాట యోధుడు ..సిఎం జగన్‌

అల్లూరి త్యాగం తెలుగు జాతికి గొప్ప గౌరవం

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: సిఎం జగన్‌ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా స్పందించారు. ఆయనకు నివాళులు అర్పించారు. మన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు. పింగళి పోరాట యోధుడు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా పతాకాన్ని రూపొందించారని సిఎం జగన్‌ కీర్తించారు.

మరోవైపు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సదర్భంగా ఆయనకు కూడా సిఎం నివాళులు అర్పించారు. ‘గిరిజనుల హక్కులకోసం పోరాడి, వారిలో స్వాతంత్ర ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, దేశంకోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీఅల్లూరి. అల్లూరి త్యాగం తెలుగు జాతికి గొప్ప గౌరవం మన్యంవీరుడు అని సిఎం జగన్‌ కీర్తించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/