నేడు రెవెన్యూ శాఖలో భూముల రీసర్వేపై సిఎం సమీక్ష

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రెవెన్యూ శాఖలో భూముల రీసర్వేపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం బొంతోరియా, బుడగ జంగం కమ్యూనిటీపై వన్‌మాన్ కమిషన్ రిపోర్ట్‌పై సిఎం సమీక్ష చేయనున్నారు. సాయంత్రం 3:45 గంటలకు కరోనాపై సిఎం ఉన్నతస్థాయి సమీక్ష జరుపనున్నారు. డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, సీఎస్, డీజీపీ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/