జీజీహెచ్లో క్యాన్సర్ వింగ్ను ప్రారంభించిన సిఎం
మరో ఏడాదిలో కర్నూలులో క్యాన్సర్ విభాగం ఏర్పాటు…జగన్
గుంటూరు: నేడు డాక్టర్స్ డే సందర్భంగా ఏపి సిఎం జగన్ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జీజీహెచ్లో అంకాలజీ విభాగం, క్యాన్సర్ వింగ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.50 కోట్లతో క్యాన్సర్ విభాగం ఏర్పాటు చేశారు. అయితే క్యాన్సర్ కేర్ సెంటర్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని జగన్ అన్నారు. కాగా మరో ఏడాదిలో కర్నూలులో క్యాన్సర్ విభాగం ప్రారంభిస్తామని జగన్ స్పష్టం చేశారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/