బ్యాంకర్లతో సిఎం జగన్ సమీక్ష సమావేశం
అన్ని వర్గాలకు రూ.2,51,600 కోట్ల రుణాలు
అమరావతి: ఏపి సిఎం జగన్ బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 211 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం జరిగింది. నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ఏపిలో 2020-21లో రూ.2,51,600 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ఏడాది కంటే 9.78 శాతం ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు సిఎంకు వివరించారు.ఈ సంవత్సరంలో వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు అందజేస్తామన్నారు. వ్యవసాయ రుణాలు గతేడాది కంటే 11.9 శాతం పెంచుతున్నామన్నారు. 2019-20 రుణ ప్రణాళికలో 99.42 శాతం లక్ష్యం చేరుకున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/