సిఎం ప్రజలకు భరోసా ఇవ్వట్లేదు

ఏపి టిడిపి నేత కళా వెంకట్రావు

kala venkata rao
kala venkata rao

అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంబిస్తుంటే ప్రజల బాగోగులు చూస్తు వారికి ధైర్యం చెప్పాల్సిన సిఎం జగన్‌ అందుబాటులో లేడంటూ టిడిపి నేత కళా వెంకట్రావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతు.. ఇంతటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం అటువంటి పనులు చేయకుండా సిఎం జగన్‌ ఇంటికే పరిమిత మయ్యారు అని చెప్పారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలను అప్రమత్తం చేస్తు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంబిస్తున్న ఈ సమయంలో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఒకవైపు న్యాస్థానాలు మొట్టికాయలు వేస్తున్నప్పటికి సిఎం తీరు మారలేదని కళా వెంకట్రావు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/