హైదరాబాద్ ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలి

ఈ జలప్రళయం ముగిసేంతవరకు హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..చంద్రబాబు

chandrababu

అమరావతి: గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ జలప్రళయం ముగిసేంతవరకు హైదరాబాద్ ప్రజలు ఇళ్ల వద్దనే ఉండడం ద్వారా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. పౌరులందరూ స్వీయరక్షణతో పాటు కుటుంబాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘మీ అందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ సేవలు అవసరమైనా ముందుండాలని, సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని టిడిపి నాయకులను, కార్యకర్తలను కోరుతున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/