వైఎస్ఆర్సిపి వచ్చాక విశ్వాసాలపై దాడులు
20కి పైగా దాడులు జరిగాయని వెల్లడి
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపిలో ప్రగతిశీల, వివిధ వర్గాల ప్రజల రాష్ట్రంగా ఉండేదని, అన్ని మత విశ్వాసాలు వికాసం పొందాయని, శాంతియుతంగా కలసిమెలసి ఉండే పరిస్థితి ఉండేదని చంద్రబాబునాయుడు వివరించారు. కానీ, నిరంకుశ వైఎస్ఆర్సిపి పాలన మొదలయ్యాక తమ మత విశ్వాసాలపై వరుసగా జరుగుతున్న దాడులతో ఏపి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ తరహా దాడులు 20కి పైగా జరిగాయని చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/