చంద్రబాబు అవమానకరంగా మాట్లడుతున్నారు

చంద్రబాబు హయంలో మద్యం ఏరులైపారింది

mla roja
mla roja

అమరావతి: వాలంటీర్లపై చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారాలోకేష్‌ తాగుబోతుల సంఘానికి అధ్యక్షుల్లా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. టిడిపి నేతలు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు హయంలో మద్యం ఏరులైపారిందన్నారు. మందు బాటిళ్లను టిడిపి ఆపీసులో ప్రదర్శించడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వచ్చాక, వైన్స్‌, బార్‌షాపులకు 40 శాతం తగ్గించామన్నారు. మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, మహిళా సాధికారత దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/