జేఏసి సమావేశానికి హాజరైన చంద్రబాబు

అనంతరం మచిలీపట్నానికి ర్యాలీగా నేతలు

Chandrababu Naidu
Chandrababu Naidu

విజయవాడ: ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన చంద్రబాబు విజయవాడలోని అమరావతి జేఏసి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అమరావతి పరిరక్షణ సమితి సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. అంతకు ముందే కార్యాలయానికి సీపీఐ నేత రామకృష్ణ చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత నేతలంతా ర్యాలీగా మచిలీపట్నం బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలని రాష్ట్రమంతా కోరుకుంటోందని అన్నారు. కుంటి సాకులతో బస్సు యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. బస్సు యాత్రను అడ్డుకుంటే ఫూల్స్ గా మిగిలిపోతారని చెప్పారు. మచిలీపట్నంకు వెళ్లే ర్యాలీని అడ్డుకుంటే ప్రభుత్వంతో తేల్చుకుంటామని హెచ్చరించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/