ఏపి మంత్రి లెటర్‌ హెడ్‌, సంతకం ఫోర్జరీ

Taneti-Vanitha
Taneti-Vanitha

అమరావతి: ఏపి మంత్రి తానేటి వనిత పోలీసులను ఆశ్రయించారు. తన లెటర్ హెడ్‌తో పాటు సంతకం ఫోర్జరీ అయ్యింది. కడపకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి ఆమె లెటర్ హెడ్, సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మంత్రి వనిత పేరుతో కడప జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు లేఖ రాశాడు. రెడ్డప్పకు అసైన్డ్ భూమి కేటాయించాలని కలెక్టర్‌కు నకిలీ సిఫార్సు లేఖ ఇచ్చాడు. మంత్రి సంతకాన్ని తప్పుగా చేయడంతో రెడ్డప్ప దొరికిపోయాడు. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో మంత్రి తానేటి వనిత సీరియస్ అయ్యారు. దీనిపై హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. తన లెట్ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసిన రెడ్డప్పపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడం ఏపి అధికార వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/