కార్యాలయాల తరలింపు జీవోపై హైకోర్టు స్టే

జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ

ap high court
ap high court

అమరావతి: ఏపి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు కొద్దిసేపటి క్రితం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసులను తరలించాలని గతంలో ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/