విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందించనున్న ఏపి ప్రభుత్వం

కరోనా కారణంగా స్తంభించిపోయిన విద్యా వ్యవస్థ

Smartphones – Students

అమరావతి: ఏపిలో కరోనా లాక్‌డౌన్‌ సడలింపులో నేపథ్యంలో షాపులు, గుళ్లు, రెస్టారెంట్లు తదితరాలన్నీ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నా విషయం తెలిసిందే. అయితే స్కూళ్లు, కాలేజీల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో, పాఠశాలలు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యా బోధనకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే, ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలంటే స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ప్రస్తుత పరిస్థితులల్లో పిల్లలకు ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లను కొనివ్వడం ఎంతో మంది తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో, విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఉచిత స్మార్ట్ ఫోన్ పథకం అందరు విద్యార్థులకు వర్తించదు. పేద విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు వరకు ఫోన్లను అందించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 60 వేల మంది విద్యార్థులు చదువుతుండగా… వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. దీంతో, విద్యార్థులకు రూ. 5 నుంచి 6 వేల వరకు విలువ కల స్మార్ట్ ఫోన్లను అందించాలని నిర్ణయించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/