ఏపిలో ప్రత్యేక కరోనా జైళ్ల ఏర్పాటు
ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: ఏపిలో కరోనాకు అడ్డుకట్ట వేసే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకొక కొవిడ్ జైలును ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురంలోని 13 జైళ్లను కరోనా జైళ్లుగా మార్చింది. కొత్త ఖైదీల ద్వారా జైలులో అప్పటికే ఉంటున్న ఇతర ఖైదీలకు వైరస్ సోకకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వచ్చే పురుష ఖైదీలను ఈ జైళ్లకు తరలించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా సోకలేదని తేలితే కోర్టు సూచించిన జైలుకు పంపిస్తారు. పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తారు. ఆయా కోవిడ్ జైళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి వైరస్ సోకకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా జైళ్ల శాఖ డీజీని ప్రభుత్వం ఆదేశించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/