ఏపిలో స్కూళ్లు పునఃప్రారంభం మరోసారి వాయిదా

తాజా నిర్ణయంతో నవంబరు 2 నుంచి స్కూళ్లు

schools

అమరావతి: ఏపిలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. కరోనా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబరు 2న స్కూళ్లు తెరుచుకుంటాయి. ఇక, పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సిఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కానుకలో భాగంగా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు అందిస్తారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/