ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి

మాస్కు వేసుకోలేదని దళిత యువకుడిని కొట్టి చంపేశారు..లోకేశ్‌

nara lokesh
nara lokesh

అమరావతి: మాస్క్‌ పెట్టుకోలేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన దళిత మువకుడిని పోలీసులు కొట్టడంతో అతడు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టిడిపి నేత నారా లోకేశ్‌ స్పందిస్తూ..ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘మాస్కు వేసుకోలేదని బంగారు భవిష్యత్తు ఉన్న దళిత యువకుడు కిరణ్ ని కొట్టి చంపేశారు. ఇప్పుడు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిష్పక్షపాతమైన ఎంక్వయిరీ జరగాలి. శిరోముండనం, కొట్టి చంపడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/