చంద్రబాబుకు ఏపి డీజీపీ సవాంగ్ లేఖ
నిజానిజాలు తెలుసుకోకుండా లేఖలు సరికాదు
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగిన తరువాత, ఆ దాడి చేసింది వైఎస్ఆర్సిపి నేతలేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ ఏపి డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈలేఖపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. నిజానిజాలు తెలుసుకోకుండా బహిరంగ లేఖలు రాయడం సరికాదని డీజీపీ చంద్రబాబుకు మరో లేఖ రాశారు. మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, సీల్డ్ కవర్ లో తనకు పంపాలని కోరారు. మీడియా రూపంలో లేఖలు విడుదల చేయడం తగదని, అలా చేస్తే, జరుగుతున్న విచారణకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఆధారాలు నిజమైతే, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/