ఎందరో పాత్రికేయులను పొత్తూరి తీర్చిదిద్దారు

సంతాపం తెలిపిన ఏపి సిఎం జగన్‌

Potturi Venkateswara Rao and CM Jagan
Potturi Venkateswara Rao and CM Jagan

అమరావతి: ప్రముఖ సీనియర్‌ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువలేనిదని సిఎం జగన్‌ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు.. తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పని చేసిన ఆయన.. ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మఅతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/