కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ముఖ్యమంత్రి

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. విభజన తరువాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని .. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం రిపోర్ట్‌లో హోదాపై ప్రస్తావన లేదని.. అయినా దానికి సాకుగా చూపుతున్నారని జగన్ లేఖలో తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/