టిడిపి సభ్యులపై మండిపడ్డ స్పీకర్‌

టిడిపి సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయి

tammineni sitaram
tammineni sitaram

అమరావతి: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అయితే టిడిపి సభ్యులు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ, స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయవద్దని, సంయమనం పాటించాలని స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా, టిడిపి సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న టిడిపి శాసనసభ్యులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తన స్థానం నుంచి లేచి వాటీజ్‌ దిస్‌ అంటూ సభ్యులపై మండిపడ్డారు. సభలో ఎవరు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో జనం గమనిస్తున్నారని స్పీకర్‌ అన్నారు. ఇది మీ ఇళ్లా..లేక అసెంబ్లీనా అని టిడిపి ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఫైర్‌ అయ్యారు. టిడిపి సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్దమని హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/