నల్ల జెండాలు, బెలూన్లతో రాజధాని రైతుల నిరసన
అమరావతి: పోలీసుల ఆంక్షలు, గృహనిర్బంధాలతోపాటు తమ గళం వినిపించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్న అమరావతి రైతులు ఈరోజు తమ నిరసనను మరో రూపంలో తెలియజేశారు. అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు రాజధాని గ్రామాల్లో మోహరించిన విషయం తెలిసిందే. డ్రోన్ల సాయంతో గ్రామాలపై నిఘా ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ మందడం, వెలగపూడి రైతులు నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు. మందడం రైతులు తమ ఇళ్లపై నల జెండాలు ఎగురవేయడమేకాక, రోడ్డుపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వెలగపూడి రైతులు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఖసేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్గ అని నినాదాలు చేయడమేకాక, నినాదాలు రాసిన బోర్డులను గోడకు వేలాడదీశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/