వెంకన్న కొండకు రాజధాని రైతుల పాదయాత్ర
39 వ రోజుకి చేరిన రైతుల నిరసనలు
అమరావతి: రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం నుంచి అనంతవరం వెంకన్న కొండకు రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పాదయాత్ర మందడం, వెలగపూడి, తుళ్లూరు మీదుగా కొనసాగనుంది. అనంతవరం వెంకటేశ్వర స్వామికి రాజధాని గ్రామాల రైతులు మొక్కులు చెల్లించనున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. 39 వ రోజు రాజధాని ప్రాంతంలో రైతలు, విద్యార్థులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/