నేడు తుళ్లూరులో అమరావతి ధూమ్ ధామ్
61వ రోజు కొనసాగుతున్న రైతుల నిరసనలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. కాగా నేటికి ఈ నిరసనలు 61వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నా. వెలగపూడిలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా.. నేడూ రైతుల 24 గంటల దీక్షలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే.. నేడు తుళ్లూరులో జేఏసి నేతృత్వంలో అమరావతి ధూమ్ ధామ్ కార్యక్రమం జరగనుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/