విజయవాడ ఏసీబీ కోర్టుకు

పోలీసులు భారీగా బందోబస్తు

Achennaidu

Vijayawada: ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును విజయవాడ ఏసీబీ కోర్టుకు అధికారులు తీసుకు వస్తున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీబీ కోర్టు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

కోర్టు పరిసర ప్రాంతాలలో ఎవరినీ అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్‌లో అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ముందు అధికారులు హాజరుపరచనున్నారు.

ఇప్పటికే విజయవాడలో టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/