ఎపిలో మరో 813 కొత్త కేసులు
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,098
Amravati: ఎపిలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.. నేడు 25,778 మందికి పరీక్షలు నిర్వహించగా, 813 మందికి కరోనా నిర్ధారణ అయింది.
వాటిలో ఎపిలోని 13 జిల్లాలకు చెందిన వారు 755 మంది ఉండగా, వలస కూలీలు 50మంది, విదేశాల నుంచి వచ్చిన ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఎపిలో మార్చి తొమ్మిదో తేది నుంచి నేటి వరకు మొత్తం 13వేల 098 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డారు.
కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో అయిదుగురు మరణించగా, పశ్చిమ గోదావరి ఒక్కరు మరణించారు.. దీంతో ఎపిలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 169కి చేరింది.
ఇక ఇప్పటివరకు 4 వేల 685 మంది వివిధ జిల్లాలోనూ, వలస కూలీలు 1131 మంది, ఎన్నాఆర్ ఐలు 92 మంది కోలుకుని హాస్పటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు..
ప్రస్తుతం జిల్లాలలో 5994 యాక్టివ్ కేసులు ఉండగా, విదేశాల నుంచి వచ్చిన 293 మంది, వలస కూలీలు 734 మంది వివిద హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/