ఏపిలో మరో 76 కొత్త పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసులు 3,118

Corona-cases-in-Andhra-Pradesh
Corona-cases-in-Andhra-Pradesh

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 10,567 శాంపిళ్లను పరీక్షించగా మరో 76 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 34 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,118 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 885 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,169 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 64కి చేరింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/