ఏపిలో మరో 70 కొత్త పాజిటివ్‌ కేసులు

నేడు 55 మంది డిశ్చార్జి

Corona Cases in Andhra Pradesh
Corona Cases in Andhra Pradesh

అమరావతి: ఏపిలో కరోనా కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గడచిన 24 గంటల్లో కరోనా మరణాలేవీ సంభవించలేదు. ఇక, విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 406 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ప్రస్తుతం 217 యాక్టివ్ కేసులు ఉన్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/