ఏపిలో మరో 448 మందికి కరోనా పాజిటివ్‌

మొత్తం 10,331 కేసులు నమోదు

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 36,047 శాంపిళ్లను పరీక్షించగా మరో 448 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 146 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 8,306 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 10,331 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 4,465 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 129 కి చేరింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/