ఏపిలో మరో 443 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల సంఖ్య 9,372

Corona-cases-in-Andhra-Pradesh
Corona-cases-in-Andhra-Pradesh

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 443 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో 51 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారివిగా గుర్తించారు. ఏపిలో ఇప్పటివరకు 9,372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 83 మంది డిశ్చార్జి కాగా, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,435కి పెరిగింది. ప్రస్తుతం 4,826 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మరో 5 మరణాలు సంభవించడంతో కరోనా మృతుల సంఖ్య 111కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/