ఏపిలో మరో 43 కరోనా పాజిటివ్ కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,930
అమరావతి: ఏపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,388 మంది శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,930గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ కాగా, 44 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 999గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/