మూడోరోజు ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: ఏపి అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. నిన్న సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చను కొనసాగించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ప్రస్తుతం సభలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈరోజు మండలిలో సీఆర్డీయే రద్దు, ఆంధ్రప్రదేశ్ పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లులపై చర్చ జరుగనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/